ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి: రాజధాని రైతులు

అమరావతి రైతుల నిరసన దీక్షలు 490వ రోజుకు చేరుకున్నాయి. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ..రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసనలు తెలిపారు.

By

Published : Apr 20, 2021, 7:55 PM IST

Amravati capital farmers protest
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 490వ రోజుకు చేరుకున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, మందడం, వెలగపూడి, నెక్కల్లు, అనంతవరం, బోరుపాలెం, దొండపాడు, అబ్బరాజుపాలెం, వెంకటపాలెం, రాయపూడి గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసన దీక్షలు కొనసాగించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆందోళనలు చేశారు. అనంతవరంలో హనుమాన్ ఛాలీసా చదువుతూ మహిళలు నిరసన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details