ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 3, 2020, 6:30 PM IST

ETV Bharat / city

విజయవాడలో అమరావతికి మద్దతుగా ఐకాస భారీ ర్యాలీ

విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని ఉండాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్ల బెలూన్లను ఎగురవేశారు. వీరికి తెదేపా నేతలు దేవినేని, బొండా ఉమలు మద్దతు తెలిపారు.

amaravthi jac conduct rally in vijayawda
amaravthi jac conduct rally in vijayawda

విజయవాడలో ఐకాస ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రైతులు, కూలీలు, మహిళలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి తెదేపా నేతలు దేవినేని ఉమ, బొండా ఉమ మద్దతు తెలిపారు. కొందరు అధికారులు అత్యుత్సాహంతో జీవోలు ఇస్తున్నారని దేవినేని ఆరోపించారు. కార్యాలయాల తరలింపుపై రైతులు న్యాయ పోరాటం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని..

ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని తమ డిమాండ్ అని బొండా ఉమ అన్నారు. విశాఖలో భూముల విలువ పెంచుకునేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మీ పనుల వల్ల రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని విమర్శించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details