ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 23, 2020, 7:44 PM IST

ETV Bharat / city

రాజధాని గ్రామాల్లో నిరసనల హోరు..వివిధ రూపాల్లో ప్రదర్శనలు

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు, మహిళలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రణభేరి కార్యక్రమంలో భాగంగా వివిధ రూపాల్లో ఆందోళనకారులు నిరసనలు తెలిపారు.

Amaravati protests against 3 capitals
Amaravati protests against 3 capitals

రాజధాని గ్రామాల్లో రణభేరి ..వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు, మహిళలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మొక్కవోని దీక్షతో అమరావతి రైతులు చేస్తున్న దీక్షలు 250వ రోజూ కొనసాగుతున్నాయి. వివిధ రూపాల్లో రైతులు తమ నిరసనను తెలియజేశారు.

తుళ్లూరు, మందడం, వెలగపూడిలో డప్పులు, పళ్లాలు మోగిస్తూ నిరసన తెలియజేశారు. నాగలి, జోడెద్దులు, గేదెలు, గొర్రెలు, మేకలతో రైతుల ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించారు. 3రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details