Amaravati Maha Padayatra in nellore: ఏకైక రాజధానిగా అమరావతిని నిలుపుకోవాలన్న సంకల్పంతో రైతులు(Amaravati farmers) చేపట్టిన పాదయాత్ర అన్ని ప్రాంతాలనూ కదిలిస్తోంది. రైతుల మహాపాదయాత్ర 30వ రోజుకు చేరుకుంది. నేడు నెల్లూరు జిల్లా అంబాపురం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అధిక సంఖ్యలో స్థానిక ప్రజల వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఆమంచర్లలో రైతులు మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. అనంతరం అక్కడినుంచి బయలుదేరి సాయంత్రం వరకు మరుపూరు వరకు పాదయాత్రను చేపట్టనున్నారు. నేడు 10 కిలో మీటర్ల మేర రైతుల మహాపాదయాత్ర సాగనుంది.
'న్యాయస్థానం నుంచి దేవస్థానం'’ పేరిట తుళ్లూరు నుంచి తిరుమల వరకూ నవంబర్ 1న మహా పాదయాత్రను చేపట్టారు. 45 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర... డిసెంబర్ 15న తిరుమలకు చేరుకునేలా ప్రణాళికను రూపొందించారు.
ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డిలాగా అందిరిలోనూ మార్పురావాలి