ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజధానిపై తీర్పు వచ్చే వరకు సీజే బదిలీ ఆపండి' - justice JK Maheshwari transfer news

జస్టిస్ జేకే మహేశ్వరిని సిక్కింకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయంపై రాజధాని రైతులు రాష్ట్రపతి, సీజేఐకు లేఖలు రాసి ఈ-మెయిల్​ ద్వారా పంపారు. రాజధాని పిటిషన్లపై విచారణ తుది దశకు చేరుకున్నందున ఆయన బదిలీని ఆపాలని అందులో కోరారు.

Amaravati farmers protest
Amaravati farmers protest

By

Published : Dec 20, 2020, 5:40 PM IST

రాజధాని పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీని ఆపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ను అమరావతి రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారికి విడివిడిగా లేఖలను ఈ-మెయిల్​ ద్వారా పంపారు.

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన తమకు న్యాయం చేయాలని కోరారు. వైకాపా ప్రభుత్వం తమను అన్ని రకాలుగా మోసం చేయటంతో.. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఈ కేసుల్లో తుది తీర్పు వచ్చే సమయంలో ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేస్తే అది తమ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details