ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మాకు కేటాయించిన ప్లాట్లను ఇప్పటికైనా అభివృద్ధి చేయండి' - amaravati latest news

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 573వ రోజుకు చేరాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా, అమరావతికి మద్దతుగా అన్నదాతలు నినాదాలు చేశారు.

amaravati farmers protest
రాజధాని రైతులు ఆందోళన

By

Published : Jul 12, 2021, 6:59 PM IST

అమరావతినే రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు 573వ రోజు ఆందోళనలు చేపట్టారు. తుళ్లూరు, మందడం, నెక్కల్లు, బోరుపాలెం, కృష్ణాయపాలెం, పెదపరిమి, మోతడక గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా, అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

తమకు ప్లాట్లు ఇచ్చి నాలుగేళ్లు దాటుతున్నా.. ఇంతవరకూ వాటి అభివృద్ధిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోయారు. తమకు కేటాయించిన ప్లాట్లలో పిచ్చిమొక్కలు వచ్చి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయని ఆవేదన చెందారు. ఇప్పటికైనా స్పందించి అమరావతిలో తమ ప్లాట్లను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details