ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 11, 2020, 11:13 AM IST

ETV Bharat / city

పోలీసు జులుం భరించలేని స్థాయికి చేరింది: రైతులు

పోలీసు జులుం భరించలేని స్థాయికి చేరిందంటూ అమరావతి రైతులు ఉద్వేగానికి గురయ్యారు. పోలీసుల నిర్బంధంతో రోడ్డున పడి అల్లాడుతున్న తమకు రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు.

amaravati agitation visuals
amaravati agitation visuals

పోలీసు జులుం భరించలేని స్థాయికి చేరింది : రైతులు

పోలీసు జులుం భరించలేని స్థాయికి చేరిందంటూ అమరావతి రైతులు ఉద్వేగానికి గురయ్యారు. తీవ్ర పోలీసు నిర్బంధంతో రోడ్డున పడి అల్లాడుతున్న తమకు రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. తుళ్లూరు మహాధర్నా శిబిరం వద్ద టెంటు వేయకుండా పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. 144 సెక్షన్ ఉన్నందున ఒకేచోట ఎక్కువమంది ఉండరాదంటూ పోలీసులు హెచ్చరికలు జారీచేసినా లెక్క చేయకుండా గ్రామస్థులు ఆందోళన కొనసాగించారు. నిరసన తెలిపే హక్కు లేదా అంటూ వాగ్వాదానికి దిగారు. ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details