పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు 333వ రోజు ఆందోళనలు చేశారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, అనంతవరం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు చేశారు. పండుగ రోజునా నిరసన దీక్షల్లో పాల్గొన్నారు. గతేడాది నుంచి పండుగలన్నీ దీక్షా శిబిరాల్లోనే నిర్వహించుకుంటున్నామని మహిళలు, రైతులు తెలిపారు. ఉద్ధండరాయునిపాలెంలో అమరావతి సంస్కాృతిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు.
పండుగ రోజునా నిరసన దీక్షల్లో అమరావతి రైతులు - అమరావతి ఆందోళనలు
అమరావతి దీక్షలు 333వ రోజు కొనసాగాయి. పండుగ రోజున ఆందోళనలు కొనసాగించారు. ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ కోరారు.
![పండుగ రోజునా నిరసన దీక్షల్లో అమరావతి రైతులు amaravathi protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9544515-118-9544515-1605354772101.jpg)
పండుగ రోజునా నిరసన దీక్షల్లో అమరావతి రైతులు