ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'విజయమ్మ గారూ.. రైతుల దగ్గరికి ఎందుకు రాలేదు?'

By

Published : Oct 3, 2020, 4:37 PM IST

మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లోని రాజధాని గ్రామాల్లో రైతులు 291వ రోజు దీక్షలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన వైఎస్ విజయమ్మ... ఉద్యమం చేస్తున్న రైతుల దగ్గరికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

Protests Continue Against Multiple Capital
Protests Continue Against Multiple Capital

రాజధాని ప్రాంతంలో పర్యటించిన వైఎస్ విజయమ్మ... ఉద్యమం చేస్తున్న రైతుల దగ్గరికి ఎందుకు రాలేదని అన్నదాతలు ప్రశ్నించారు. ఎన్నికల ముందు జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని ఊరూరా విజయమ్మ తిరిగారని వారు గుర్తు చేశారు.

రైతుల కష్టాలను పరిష్కరించాలని ఎందుకు అడగటం లేదని నిలదీశారు. ఇప్పటికైనా అమరావతిలోని భవనాలు గ్రాఫిక్స్ కావని.. అవి నిజమైనవి అన్న విషయాన్ని సీఎం​కు చెప్పాలని సూచించారు. రైతులు, మహిళల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details