ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అమరావతి, పోలవరం కట్టే సామర్థ్యం సీఎంకు లేదు' - ఏపీ రాజధాని రైతుల ఆందోళనలు

అమరావతి రైతులు 334వ రోజు దీక్షలు కొనసాగించారు. పోలవరం, అమరావతి కట్టే సామర్థ్యం సీఎం జగన్​కు లేదని అమరావతి రైతులు విమర్శించారు.

amaravathi protest
అమరావతి ఆందోళనలు

By

Published : Nov 15, 2020, 4:17 PM IST

పరిపాలన వికేంద్రీకరణను నిరసిస్తూ అమరావతి గ్రామాల్లో రైతులు, మహిళలు 334వ రోజు ఆందోళనలు నిర్వహించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, వెంకటపాలెం, అనంతవరం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం గ్రామాల్లో దీక్షలు చేశారు. అమరావతికి మద్దతుగా దీక్షా శిబిరాల్లో నినాదాలు చేశారు.

పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడంపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్​కు అమరావతి, పోలవరం కట్టే సామర్థ్యం లేదని విమర్శించారు. తుళ్లూరులో మహిళలు భగవద్గీత చదువుతూ నిరసన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details