ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 18, 2020, 7:06 PM IST

ETV Bharat / city

306వ రోజూ అమరావతి దీక్షలు.. శిబిరాల్లో అమ్మవారికి పూజలు

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు 306వ రోజు ఉద్యమాన్ని కొనసాగించారు. దీక్షా శిబిరాల్లో ప్రతిష్ఠించిన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రైతులు నిరసన చేపట్టారు.

amaravathi farmers protest
అమరావతి దీక్షలు

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు 306వ రోజు ఉద్యమాన్ని కొనసాగించారు. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లోని రాజధాని గ్రామాల్లో నిరసన దీక్షలు కొనసాగించారు. లింగాయపాలెంలో అన్నదాతలు చేస్తున్న దీక్షకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మద్దతు ప్రకటించారు.

మందడం, అబ్బరాజుపాలెం దీక్షా శిబిరాల్లో.. ఉద్యమ కారిణి, జగజ్జనని బాలా త్రిపుర సుందరిగా అలంకరించి పూజలు నిర్వహించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. కృష్ణాయపాలెంలో రైతులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details