హైదరాబాద్లోని బోయిన్పల్లిలో ప్రవీణ్రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ మూడో రోజు కస్టడీ బుధవారం ముగిసింది. గురువారం మధ్యాహ్నం ఆమెను పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ లోపు ఆమె నుంచి మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మొదట పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు అఖిలప్రియ దాటవేత ధోరణి అవలంబించినట్లు తెలిసింది. అపహరణ కేసులో సేకరించిన సాంకేతిక ఆధారాలను ఆమె ముందుంచటంతో కొన్నింటిని ఒప్పుకున్నట్లు సమాచారం. హఫీజ్ పేటలోని 25 ఎకరాల భూమికి సంబంధించి ప్రవీణ్రావు సోదరులతో చర్చించడానికి ప్రయత్నించినప్పటికీ వాళ్లు నిరాకరించినట్లు పోలీసుల వద్ద ఆమె తెలిపినట్లు సమాచారం. అఖిలప్రియ చెప్పిన సమాచారంతో పోలీసులు పలు ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.
స్కెచ్ ఇలా వేశారు!