స్థానిక సంస్థల ఎన్నికలకు తదుపరి నోటిఫికేషన్ విడుదల చేసే ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఎన్నికల కమిషన్ను సుప్రీంకోర్టు ఆదేశించిందని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. దిల్లీ నుంచి వచ్చిన ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రస్తుత అభివృద్ధి పథకాలన్నింటిని కొనసాగించొచ్చని.. ఈ మేరకు సుప్రీం ఆదేశాలిచ్చిందని శ్రీరామ్ తెలిపారు. ఎన్నికల కమిషన్ వేసిన కేవియెట్ పిటిషన్ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని వాదించినట్లు ఆయన స్పష్టం చేశారు.
'ఎస్ఈసీ కేవియెట్ పిటిషన్ వెనుక రాజకీయ దురుద్దేశం' - ఎన్నికల కమిషన్పై అడ్వొకేట్ జనరల్ కామెంట్స్
స్థానిక ఎన్నికలకు తిరిగి నోటిషికేషన్ ఇచ్చే ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఎస్ఈసీకి సుప్రీం ఆదేశాలిచ్చిందని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ చెప్పారు. ప్రస్తుత పథకాలన్నీ కొనసాగించవచ్చని ధర్మాసనం స్పష్టం చేసిందన్నారు.
!['ఎస్ఈసీ కేవియెట్ పిటిషన్ వెనుక రాజకీయ దురుద్దేశం' Advocate general comments on election commission](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6458644-888-6458644-1584550417528.jpg)
అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్
మీడియాతో మాట్లాడుతున్న అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్