ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం... నేడు మరోసారి పరీక్షలు...

By

Published : Dec 26, 2020, 9:22 AM IST

అధిక రక్తపోటుతో అస్వస్థతకు గురైన ప్రముఖ నటుడు రజనీకాంత్​ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు రక్తపోటులో హెచ్చతగ్గులు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో రెండు రోజులపాటు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు.

actor-rajanikanth-health-updates-thaliva-stable-fans-offer-prayers-for-recovery
ప్రస్తుతం నిలకడగానే ఉన్న రజనీకాంత్ ఆరోగ్యం: ఆస్పత్రి వర్గాలు

అనారోగ్యంతో హైదరాబాద్​ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు రజనీకాంత్​ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గం ప్రకటన విడుదల చేసింది. రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రకటించారు. రజనీకాంత్‌కు తోడుగా ఆయన కుమార్తె ఉన్నారని చెప్పారు. తలైవాను పరామర్శించేందుకు, ఆరోగ్య పరిస్థితిపై వాకబు కోసం ఎవరినీ అనుమతించట్లేదని పేర్కొన్నారు.

ఈ మేరకు శనివారం మరోసారి ​రజనీకి కొవిడ్ నిర్ధరణ పరీక్షలతో పాటు.. గుండె సంబంధిత పరీక్షలు చేయనున్నట్లు సమాచారం. ఆ నివేదికలు వచ్చిన తర్వాతనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది.

తలైవా త్వరగా కోలుకోవాలి: ప్రముఖుల ఆకాంక్ష

రజనీకాంత్‌ అస్వస్థతకు గురికావడంపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు వాకబు చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌, మోహన్​ బాబు, మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు. రజనీ మానసికంగా, శారీరకంగా దృఢమైన వ్యక్తని, త్వరగా కోలుకొని పనులు మొదలుపెడతారని మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:హాట్​లుక్స్​తో దిశాపటానీ పోజులు- కుర్రకారుకు గుబులు

ABOUT THE AUTHOR

...view details