అమరావతిపై శాసనసభలో చర్చించిన సమయంలో అప్పటి ప్రతిపక్షనేత జగన్ అమరావతిని వెల్కమ్ చేస్తున్నాని చెప్పారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. 13 జిల్లాలకు అమరావతి అందుబాటులో ఉంటుందని జగన్ అన్నారని పేర్కొన్నారు. సీఎం ఏ సందర్భంలో రాజధాని గురించి మాట్లాడారో చెప్పాలన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలనే మాటకు తెదేపా కట్టుబడి ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
'అమరావతి రాజధానిగా ఉండాలి.. అభివృద్ధి వికేంద్రికరణ జరగాలి' - అమరావతిపై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు న్యూస్
అమరావతిపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తెదేపా నేత అచ్చెన్నాయుడు ఖండించారు. ఆ రోజు అందరితో చర్చించి .. అమరావతిని రాజధానిగా నిర్ణయించినట్లు గుర్తుచేశారు. ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి జగన్ గందరగోళం సృష్టించారని ఆరోపించారు.
!['అమరావతి రాజధానిగా ఉండాలి.. అభివృద్ధి వికేంద్రికరణ జరగాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5406810-279-5406810-1576598015536.jpg)
achhennaidu about capital amaravathi
'అమరావతి రాజధానిగా ఉండాలి.. అభివృద్ధి వికేంద్రికరణ జరగాలి'