ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గాలి జనార్ధన్​రెడ్డి బెయిల్ కేసు ఈ నెల 12కి వాయిదా - గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కేసును వాయిదా వేసిన అనిశా న్యాయస్థానం

ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్​రెడ్డి అక్రమంగా బెయిల్ పొందారన్న అభియోగంపై విచారణను అనిశా న్యాయస్థానం ఈనెల 12కి వాయిదా వేసింది. సీబీఐ అధికారి ఆర్ఎం ఖాన్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన కోర్టు.. నిందితుల తరఫు న్యాయవాదుల కోరిక మేరకు మరోసారి విచారణకు అవకాశమిచ్చింది.

gali janardhan reddy bail case adjourned to january 12
గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కేసు జనవరి 12కు వాయిదా

By

Published : Jan 8, 2021, 9:08 PM IST

గాలి జనార్ధన్​రెడ్డి బెయిల్ కుంభకోణంలో సీబీఐ అధికారి ఆర్ఎం ఖాన్ వాంగ్మూలాన్ని.. అనిశా న్యాయస్థానం నమోదు చేసింది. కేసు విచారణను ఈనెల 12కి వాయిదా వేసింది. ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్​రెడ్డి అక్రమంగా బెయిల్ పొందారన్న అభియోగంపై అనిశా కోర్టు విచారణ జరుపుతోంది.

ఈ విషయమై అనిశాకు ఫిర్యాదు చేసిన ఓఎంసీ కేసు దర్యాప్తు అధికారి, సీబీఐ అదనపు ఎస్పీ ఆర్ఎం ఖాన్.. ప్రధాన సాక్షిగా ఈరోజు కోర్టుకు హాజరయ్యారు. నిందితుల తరఫున న్యాయవాదులు ప్రశ్నలు సంధించగా.. మరోసారి అవకాశమివ్వాలని వారు కోరడంతో విచారణ వాయిదా పడింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details