హైదరాబాద్ మహా నగరంలో ఒకవైపు కొంతమంది అర్ధాకలితో అలమటిస్తుండగా మరోవైపు కలిగిన కుటుంబాల్లో ఒక్కొక్కరు ఏడాదికి 50 కిలోలకు పైగా ఆహారాన్ని వృథా చేస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిలో ఉన్నవారి దాతృత్వంతో పేదల ఆకలి తీర్చేందుకు ఓ హోటల్ యజమాని చేసిన ఆలోచన నిత్యం పదుల సంఖ్యలో అన్నార్తుల క్షుద్బాధని తీరుస్తోంది.
అన్నార్తుల అక్షయపాత్ర.. ఈ పుణ్యాల బుట్ట - nek ki roti.. free roti
నాగరికత ఎంత అభివృద్ధి చెందుతున్నా, ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. నేటికీ మూడు పూటలా కడుపు నిండా అన్నం లభించని పేదలు ఎందరో. ఓ హోటల్ యజమాని చేసిన ఆలోచన ఆకలితో ఉన్న వారి కడుపు నింపుతోంది.
![అన్నార్తుల అక్షయపాత్ర.. ఈ పుణ్యాల బుట్ట punyala butta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11104576-514-11104576-1616376692795.jpg)
punyala butta
హైదరాబాద్ టోలిచౌకిలో (సెవెన్టూంబ్స్ దారిలో)ని ‘అబ్దుల్లా నాన్ మహల్’ నిర్వాహకులు ఇక్బాల్ తన హోటల్ ముందు ‘నేకీ కి టోక్రీ.. ఫ్రీ రోటీ’ (పుణ్యాల బుట్ట.. ఉచితంగా రొట్టె) పేరుతో ఓ బుట్టని ఏర్పాటు చేశారు. దాతలు ఇందులో వేసే రొట్టెలను ఆయన పేదలకు పంచుతున్నారు. ఇక్కడికి వచ్చే వినియోగదారులు అదనంగా ఆ హోటల్లోనే రొట్టెలు కొని వాటిని ఈ బుట్టలో వేసి వెళ్తుండగా.. ఆ రొట్టెలతో రోజుకు వంద మందికి పైగా పేదల ఆకలి తీరుతోందని ఇక్బాల్ తెలిపారు.
- ఇదీ చదవండి :నేడు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం