Nizamabad Bike Accident: 'అమ్మా.. నాన్న.. అక్క.. నేను బైక్పై ఇంటి నుంచి బయలుదేరాం. అర్ధరాత్రి కావడంతో చాలా చీకటిగా ఉంది. కుక్కల అరుపులు.. పరిసరాలన్నీ నిశబ్ధంగా ఉండటంతో నాకు, అక్కకు చాలా భయమేసింది. మా భయం పోగొట్టాలని నాన్న మాకు కథ చెబుతూ బండి నడుపుతున్నాడు. మేం ఆ కథ వింటూ భయం మరిచిపోయి హాయిగా వెళ్తున్నాం. ఇంతలో గట్టిగా ఏదో శబ్దం వినిపించింది. నాకు తెలియకుండానే కళ్లు మూసుకుపోయాయి. నేను కళ్లు తెరవడానికి మెల్లగా ప్రయత్నించాను. చూసేసరికి అమ్మా.. నాన్న.. అక్క అందరూ ఒక్కో వైపు పడిపోయి ఉన్నారు. నాకు భయమేసింది. అమ్మా.. అమ్మా.. లే అమ్మా అని చాలా ఏడ్చాను. కానీ అమ్మ నా దగ్గరికి రాలేదు. నాన్నను పిలిచాను అసలు వినిపించుకోలేదు. అక్క నాకు చాలా దూరంలో ఉంది. ఓపిక లేకపోయినా చాలా గట్టిగా పిలిచాను. అక్క కూడా నా మాట వినిపించుకోలేదు. అలా వాళ్లని పిలుస్తూ ఎప్పుడు కళ్లు మూశానో తెలియదు.. ఇలా ఆస్పత్రిలో కళ్లు తెరిచాను. రాత్రి జరిగింది యాక్సిడెంట్ అని అమ్మా.. నాన్న.. అక్క.. స్పాట్లోనే చనిపోయారని తెలిసింది.' - నిజామాబాద్ రోడ్డు ప్రమాదంలో గాయాలతో బయటపడ్డ చిన్నారి
Family Died in Nizamabad Accident : తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ కుటుంబాన్ని కారు రూపంలో మృత్యువు వెంటాడింది. కమ్మర్పల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన క్రిష్ణ, రజిత దంపతులు తమ కుమార్తెలు రాఘవి, శరణ్యలతో వేరే ఊరు బయలుదేరారు.