ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 3, 2021, 11:08 AM IST

ETV Bharat / city

మేకలమందలో అనుకోని అతిథి!

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా లింగాలలో ఓ కాపరి మేకలను మేపడానికి.. స్థానిక అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చి మేకలను కొట్టంలోనికి పంపుతుండగా అనుకోకుండా ఆ గుంపుతో కలిసి వచ్చిన అతిథిని చూసి ఆశ్చర్యపోయాడు. అటవీ అధికారులకు ఫోన్​ చేశాడు.

nagar karnool
అటవీ అధికారులకు జింకను అప్పగిస్తున్న గ్రామస్థులు

అటవీ ప్రాంతం నుంచి మేకల మందతో కలిసి వచ్చిన ఓ జింకను.. స్థానికులు కాపాడి అడవిలోకి వదిలారు. తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిందీ ఘటన. లింగాల మండల కేంద్రానికి చెందిన ఓ కాపరి మేకలను మేపడానికి.. స్థానిక అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తిరుగుముఖం పట్టాడు. మేకలను కొట్టంలోనికి పంపుతుండగా వాటితో కలిసి వచ్చిన జింకను చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు.

వెంటనే.. అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు.. రాత్రి జింకను పద్మన పల్లి బీట్ అడవిలో వదిలేశారు. వన్య ప్రాణులు అనుకోకుండా గ్రామాల్లోకి వస్తే ఎవరూ హాని తలపెట్టకుండా సమాచారం అందించాలని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రమేశ్ కోరారు. జింకను కాపాడిన స్థానికులను అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details