ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 19, 2022, 10:25 AM IST

ETV Bharat / city

కూల్​డ్రింక్​ అనుకుని పురుగుల మందు తాగిన చిన్నారి.. 10 ఆస్పత్రులు తిప్పినా..!

child died after drinking Pesticide : అప్పటి వరకూ ఇంట్లో వాళ్లతో హాయిగా గడిపింది. పాఠశాలకు సెలవు కావడంతో కాసేపు ఆడుకుందామని బయటకు వెళ్లింది. అంతలోనే ఓ బాటిల్​ను చూసి.. అందులో ఉన్న పానీయం కూల్​డ్రింక్ అనుకుని తాగేసింది. అంతే.. ఈ లోకాన్ని విడిచి అనంత లోకాలకు చేరింది. ఈ విషాదకర ఘటన తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

శాన్వి
శాన్వి

child died after drinking Pesticide : తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్​ మండలంలోని భీంపూర్​ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కూల్​డ్రింక్​ అనుకుని పురుగుల మందు తాగి.. శాన్వి అనే ఓ ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన రాజేశ్ ​- లావణ్య దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె శాన్వి ఉన్నారు. ఐదేళ్ల శాన్వి.. ఓ ప్రైవేట్​ పాఠశాలలో ఎల్​కేజీ చదువుతోంది. నిన్న ఆదివారం కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటోంది. ఈ క్రమంలోనే ఇంటి ఆవరణలోని ఓ​ బాటిల్​లో ఉన్న పురుగుల మందును కూల్​డ్రింక్​ అనుకుని తాగేసింది.

శాన్వి

అనంతరం ఇంటికి వచ్చిన చిన్నారి.. వాంతులు చేసుకోవడం గమనించిన కుటుంబసభ్యులు.. వెంటనే కాగజ్​నగర్​ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పట్టించుకోకపోవడంతో మంచిర్యాలకు వెళ్లారు. అక్కడా చిన్నారిని చేర్చుకోకపోవడంతో సుమారు మరో 10 ఆసుపత్రులు తిరిగారు. అయినా ఒక్కరూ చిన్నారిని ఆసుపత్రిలో చేర్చుకోలేదు. చివరకు ఓ ఆసుపత్రిలో చూపించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఆడుకున్న చిన్నారి.. అంతలోనే అనంతలోకాలకు చేరడంతో వారి రోదనలు మిన్నంటాయి. స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details