ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Top news: ప్రధానవార్తలు @ 9PM

.

By

Published : Nov 15, 2021, 9:01 PM IST

9PM TOP NEWS
ప్రధానవార్తలు @ 9PM

  • ఉద్రిక్తతల మధ్య ముగిసిన పురపోరు..
    పురపోరులో మిగతా చోట్లా అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు(AP Municipal Elections news) చోటుచేసుకున్నాయి. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని విపక్షాలు ఆందోళనలకు దిగాయి. పోలీసులు వైకాపాకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'జూన్ నాటికి రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పూర్తి కావాలి'
    రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణపై సీఎం జగన్‌ సమీక్ష(CM Jagan review) నిర్వహించారు. రోడ్ల మరమ్మతుల పనులను వెంటనే ప్రారంభించాలని సంబంధితశాఖ అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా చేయాలని దిశానిర్దేశం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి.. ఇన్ని కుట్రలా? - చంద్రబాబు
    ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఇన్ని కుట్రలా చేయాలా అని.. వైకాపా ప్రభుత్వాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇంత దారుణ పనులు చేస్తే.. చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 2024లో అధికారం దిశగా అడుగులేయాలని అమిత్ షా దిశానిర్దేశం: వీర్రాజు
    2024లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata party) అధికారంలోకి వచ్చే విధంగా అడుగులు వేయాలని కేంద్రమంత్రి అమిత్ షా(centrel minister Amit shah) సూచించినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'రాణి కమలాపతి రైల్వే స్టేషన్​ దేశానికి అంకితం'
    మధ్యప్రదేశ్​ భోపాల్​లో ఆధునికీకరించిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్​ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ స్టేషన్​ నవ భారత్​ నిర్మాణంలో భాగమని, అందుకే దేశానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'కుంటిసాకులు మాని.. ఏ చర్యలు తీసుకుంటారో తేల్చండి'
    వాహనాలు, పరిశ్రమలు, భవన నిర్మాణ పనులు వంటివే దిల్లీలో వాయు కాలుష్యానికి(Delhi Air Pollution) ప్రధాన కారకాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రైతుల పంట వ్యర్థాలు తగలబెట్టడమే కాలుష్యానికి ప్రధాన కారణం కాదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమెరికా ఆయుధాలతో తాలిబన్ల బల ప్రదర్శన
    అఫ్గాన్​లో అధికారం చేపట్టిన తాలిబన్లు.. అమెరికా, ఇతరదేశాల దళాలు వదిలేసి వెళ్లిన ఆయుధాలతో ఆదివారం బల ప్రదర్శన(Taliban military parade) నిర్వహించారు. తాలిబన్‌ దళాల్లో 250 మంది సైనికులు కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కవాతు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తగ్గిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..
    ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర (Gold Price today) భారీగా తగ్గింది. వెండి ధర కూడా అదే దారిలో పతనమైంది. 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.200 తగ్గగా.. వెండి ధర (Silver price today) కిలోకు రూ.610 కిందికి దిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐసీసీ జట్టులో టీమ్​ఇండియా క్రికెటర్లకు దక్కని చోటు
    ఆస్ట్రేలియాను జగజ్జేతగా నిలిచిన టీ20 ప్రపంచకప్​ (T20 World Cup) ఆదివారంతో పూర్తయింది. ఎందరో క్రికెటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వారిలో మెరికల్లాంటి ప్లేయర్లతో 'టీమ్​ ఆఫ్​ ది టోర్నమెంట్​'ను ప్రకటించింది ఐసీసీ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సూపర్​హిట్ 'జై భీమ్​'పై ఇన్ని వివాదాలు ఎందుకు?
    బ్లాక్​బస్టర్ హిట్స్​గా నిలిచే కొన్ని సినిమాలు వివాదాల సుడి గుండంలో చిక్కుకుంటాయి. అందులో నటించిన నటులకు బెదిరింపులూ వస్తుంటాయి. సినిమా నిర్మించినవారిపై కేసులు పెట్టి రూ.కోట్లు డిమాండ్ చేసిన ఘటనలూ ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details