ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9 PM

.

By

Published : Apr 15, 2022, 8:57 PM IST

TOP NEWS
TOP NEWS

  • "జగన్‌ కొత్త తరహా క్విడ్‌ ప్రోకోకి తెరలేపారు"
    సంక్షేమ పథకాల పేరుతో పేదలకు డబ్బు పంచుతూ ముఖ్యమంత్రి జగన్‌ కొత్త తరహా క్విడ్‌ ప్రోకోకి తెరలేపారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఆరోపించారు. ఒక ఆర్థిక క్రమ శిక్షణ లేకుండా చేస్తున్న పనులకు రాష్ట్రం మూల్యం చెల్లించుకుంటోందని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రోడ్డెక్కిన విపక్షాలు.. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్
    ఆర్టీసీ ఛార్జీల పెంపుపై తెలుగుదేశం ఆందోళనలు మిన్నంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ఎదుట నేతలు నిరసన తెలిపారు. రిక్షాలు తొక్కుతూ ఆందోళన నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'జగన్ పరిపాలనలో న్యాయస్థానాలకు సైతం రక్షణ లేదు'
    నెల్లూరు జిల్లా కోర్టులో జరిగిన చోరీ ఘటనపై హైకోర్టు విచారణ జరిపించాలని తెదేపా, భాజపా నేతలు డిమాండ్ చేశారు. జగన్​రెడ్డి పరిపాలనలో న్యాయస్థానాలకు సైతం రక్షణ లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విరమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తొక్కిసలాటపై తితిదే ఛైర్మన్​, ఏఈవోల భిన్న స్పందన..
    తిరుమల శ్రీవారి సర్వదర్శన టికెట్ల కోసం ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై తితిదే ఛైర్మన్​, ఏఈవో భిన్నంగా స్పందించారు. ఒకరేమో తమదే తప్పని వ్యాఖ్యానించగా మరొకరు భక్తుల అత్యుత్సాహమే కారణమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆరోగ్య భారతం.. పదేళ్లలో రికార్డు స్థాయికి వైద్యుల సంఖ్య'
    భారత్‌లో పదేళ్లలో రికార్డు స్థాయిలో వైద్యులు తయారవుతారని అని ప్రధాని మోదీ అన్నారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేసి.. అందరికీ వైద్య విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామని ఆయన చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆటోలోనే మహిళపై గ్యాంగ్ రేప్
    ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు కిరాతకులు. అనంతరం మహిళ నుంచి నగదు, మొబైల్ ఫోన్​ లాక్కున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'కీవ్​పై క్షిపణుల వర్షం'.. ఉక్రెయిన్​కు రష్యా వార్నింగ్
    ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం కీలక మలుపు తీసుకుంది. రష్యా దాడుల్ని నిలువరిస్తూ వస్తోన్న ఉక్రెయిన్‌ సేనలు ప్రతిదాడులకు తెగబడుతున్నాయి. కీలక యుద్ధ నౌక మస్క్‌వా ధ్వంసంతో పాటు రష్యా గ్రామాలపై ఉక్రెయిన్‌ సేనలు దాడులకు తెగబడినట్లు వార్తలు వ‌చ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇజ్రాయెల్ పోలీసులకు, పాలస్తీనియన్లకు ఘర్షణ.. 152 మందికి గాయాలు
    జెరూసలెంలో పాలస్తీనియన్లకు, ఇజ్రాయెల్ పోలీసులకు మధ్య మరోమారు ఘర్షణ తలెత్తింది. ప్రముఖ ప్రార్థన మందిరంలో ఈ ఉద్రిక్తతలు తలెత్తగా 152 మంది పాలస్తీనియన్లు, పలువురు పోలీసు అధికారులు గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇంగ్లాండ్​ క్రికెటర్​ రూట్​ సంచలన నిర్ణయం
    ఇంగ్లాండ్​ క్రికెటర్​ జో రూట్​ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నా తర్వాతి సినిమా 'దిల్లీ ఫైల్స్': వివేక్​ అగ్నిహోత్రి
    'కశ్మీర్ ఫైల్స్'తో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.. తాను చేయబోయే తర్వాతి సినిమా 'దిల్లీ ఫైల్స్' అని ప్రకటించారు. 'కశ్మీర్ ఫైల్స్'ను ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details