ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 5, 2022, 8:59 AM IST

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM

..

9AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 9 AM

  • పోలవరం భూసేకరణలో భారీ అక్రమాలు.. లబోదిబోమంటున్న బాధితులు
    స్థలాలు, సర్వే నంబర్లు అవే..! డీ-పట్టాల్లో(D- Patta) పేర్లు మాత్రం మారుతున్నాయి. లబ్ధిదారులకు అందాల్సిన పరిహారం మోసగాళ్ల ఖాతాల్లోకి చేరుతోంది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పోలవరంలో నిర్వాసితులకు అందాల్సిన పరిహారంలో చోటుచేసుకుంటున్న అక్రమాలివి..! అసలైన భూయజమానులు పరిహారం అందక ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతూ అవమానాలు ఎదుర్కొంటుంటే.. అక్రమార్కులు దొంగ డీ-పట్టాలు సృష్టించి.. గంటల వ్యవధిలోనే డబ్బులు కాజేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • YS Viveka Murder Case: 'సాక్షులను బెదిరిస్తున్నారు.. వారికి బెయిల్​ ఇవ్వొద్దు..'
    HC On Viveka murder case Accused Bail Petition: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులకు బెయిల్‌ మంజూరు చేయొద్దని ఆయన కుమార్తె సునీత తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. జైల్లో ఉంటూనే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి.. సాక్షుల్ని బెదిరించడంతోపాటు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు. మొదటి అభియోగపత్రంలోని వివరాలతో పోలిస్తే.. రెండోదానిలో శివశంకర్‌రెడ్డి పాత్రపై పురోగతి ఉందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • CM Jagan News: నేడు తిరుపతిలో సీఎం జగన్ పర్యటన​
    CM Jagan Tirupati Tour: ముఖ్యమంత్రి జగన్.. నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఉదయం తిరుపతి ఎస్వీ వెటర్నరీ కళాశాల మైదానంలో నిర్వహించే విద్యాదీవెన బహిరంగసభలో పాల్గొంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'రుషికొండ రిసార్టు' నిర్మాణంపై వ్యాజ్యంలో అధికారులకు నోటీసులు
    high court on Rushikonda resort: విశాఖలోని రుషికొండ రిసార్టు నిర్మాణ విషయంలో ఏపీ పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ ఎండీతోపాటు మరి కొంతమంది అధికారులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రిసార్టు నిర్మాణంలో న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై కోర్టు స్పందించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జమ్మూ​, పాక్ మధ్య సొరంగం! వారి పనేనా?
    BSF Detects Tunnel: జమ్ముకశ్మీర్​ సాంబా ప్రాంతంలో ఓ సొరంగం బయటపడింది. పాకిస్థాన్​ సరిహద్దుకు అత్యంత సమీపంలోనే ఉన్న కారణంగా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇటీవల ఇద్దరు జైషే మహ్మద్​ సూసైడ్​ బాంబర్లు.. ఈ సొరంగం గుండానే భారత్​లోకి చొరబడినట్లు అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్.. స్కూల్​ నుంచి వస్తుండగా..
    Minor Girl Rape: ఆడపిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. దారుణాలకు పాల్పడుతున్నారు. స్కూల్​ నుంచి ఇంటికొస్తున్న బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు ఐదుగురు దుండగులు. బిహార్​ జముయీలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శ్రీలంకను ముంచిన రాజపక్స పాలన.. పాతాళానికి మారక నిల్వలు
    Sri Lanka crisis: శ్రీలంక సంక్షోభాన్ని గణాంకాలతో కళ్లకు కట్టారు ఆ దేశ మంత్రి. విదేశీ మారకపు నిల్వలు 700 కోట్ల డాలర్ల నుంచి 5 కోట్ల డాలర్ల దిగువకు పడిపోయాయని తెలిపారు. కాగా, రాజపక్స విధానాలు, ఆయన కుటుంబ పాలనే సంక్షోభానికి దారితీశాయని పలువురు వాదిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వడ్డీ రేట్లు పెంచిన ఫెడ్.. 20ఏళ్లలో ఇదే అత్యధికం
    Fed interest rate: కీలక వడ్డీ రేట్లను పెంచుతూ అమెరికా ఫెడరల్ రిజర్వు నిర్ణయం తీసుకుంది. రేట్లను 0.5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో రేట్ల పెంపునకే మొగ్గు చూపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ జెర్సీ విలువ రూ.70కోట్లా?
    Maradona's Jersy record price: 2020లో కన్నుమూసిన ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా పేరిట తాజాగా ఓ రికార్డు నమోదైంది. 1986 ప్రపంచకప్‌లో అతడు ధరించిన ఓ జెర్సీ వేలంలో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. ఏకంగా రూ.70కోట్లు పెట్టి దీనిని కొనుగోలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కమల్​ హాసన్​ 'విక్రమ్'​ @125కోట్లు.. రిలీజ్​కు ముందే రికార్డు!
    Kamalhassan Vikram Digital rights record: కమల్​హాసన్ నటిస్తున్న 'విక్రమ్'​ సినిమా రిలీజ్​ కాకముందే ఓ రికార్డు సాధించింది. ఈ మూవీ శాటిలైట్‌, డిజిటల్‌ హక్కులు సుమారు రూ.125 కోట్లకు అమ్ముడుపోయాయని తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details