ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు@ 7PM - తెలుగు తాజా వార్తలు

.

7pm Top news
7pm Top news

By

Published : Jan 11, 2022, 7:00 PM IST

  • ఉద్యోగుల సెలవు తేదీల్లో మార్పులు..
    ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన సెలవు తేదీల్లో మార్పులు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పండగ పురస్కరించుకుని.. 13,14,15 తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు
    రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24గంటల్లో.. 24,280 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,831 కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో..7,195 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బూస్టర్ డోస్ వేసుకోవాలి: కాటమనేని భాస్కర్
    ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా బూస్టర్ డోసు వేసుకోవాలని.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చిరంజీవి పార్టీ పెట్టకుంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లం: చంద్రబాబు
    ప్రజాస్వామ్యంలో మీడియాకు ఓ విశ్వసనీయత ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం ఆధ్వర్యంలో నడిచే చైతన్య రథం ఈ-పేపర్‌ను ఆయన ఆవిష్కరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐవీఎఫ్​ పద్ధతిలో పుంగనూర్​ లేగదూడ జననం- దేశంలోనే తొలిసారి!
    అంతరించిపోతున్న పశుజాతుల్లో ఒకటైన పుంగనూర్​ జాతి ఆవు దూడకు కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్​) ద్వారా పురుడు పోశారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • డిజిటల్ అస్త్రాలతో యూపీ సమరం- 50 లక్షల మందితో మోదీ '3డీ' సభ!
    ఉత్తర్​ప్రదేశ్​లో భారీ వర్చువల్ సభకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఈ సభకు అధునాతన సాంకేతికతతో కొత్త హంగులు అద్దుతున్నారు కమలనాథులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి మాయావతి దూరం
    బహుజన్​ సమాజ్ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని వెల్లడించారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్​ చంద్ర. ఈ ఎన్నికల్లో బీఎస్​పీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 2021-22 ఐటీఆర్​ దాఖలుకు గడువు పెంపు
    2021-22 మదింపు సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలు తేదీని పొడిగించింది సీబీడీటీ. మార్చి 15 వరకు ఇందుకు అవకాశమిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • టీమ్​ఇండియాకు షాక్​.. వన్డే జట్టు ఆల్​రౌండర్​కు కొవిడ్
    కొద్దిరోజుల్లో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్​ ప్రారంభంకానున్న నేపథ్యంలో టీమ్​ఇండియాకు భారీ షాక్​ తగిలింది. వన్డే జట్టుకు ఎంపికైన ఆల్​రౌండర్ వాషింగ్టన్ సుందర్​కు కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శింబుకు గౌరవ డాక్టరేట్.. ​ రవితేజ సినిమాలో సుశాంత్​
    కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. ఇందులో హీరోలు శింబు, రవితేజ, వరుణ్​తేజ్​కు సంబంధించిన సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details