ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 30, 2019, 6:10 PM IST

ETV Bharat / city

అమ్మఒడికి రూ.6 వేల 455 కోట్లు... కేబినెట్ ఆమోదం

ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ చదివే విద్యార్థులకు అమ్మఒడి పథకం ద్వారా... ఏడాదికి రూ.12 వేలు సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలుకు రూ.6 వేల 455 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమ్మఒడి పథకాన్ని వచ్చే జనవరిలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించున్నారు.

AMMAVODI

మంత్రి పేర్ని నాని

ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు అమ్మఒడి పథకం వర్తిస్తుందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. చిన్నారులకు తల్లి లేకుంటే... వారి సంరక్షకులకు అమ్మఒడి నగదు అందిస్తామని చెప్పారు. ఈ పథకానికి తెల్ల రేషన్ కార్డు, ఆధార్‌ కార్డు తప్పనిసరి అని చెప్పారు. జనవరి నుంచి అర్హుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని వివరించారు.

గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు రూ.128 కోట్లు..

గర్భిణులు, బాలింతలు, 6 నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు... పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రక్తహీనత, పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న 77 మండలాలను గుర్తించిన ప్రభుత్వం... ఆ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అదనంగా రూ.128 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ సాయంతో కలిపి మొత్తం... రూ.305 కోట్లు వెచ్చించాలని నిర్ణయించినట్లు పేర్ని నాని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details