ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 5pm - trending news

.

5pm top news
ప్రధాన వార్తలు@ 5pm

By

Published : Jul 2, 2020, 5:00 PM IST

  • 'విశాఖలో హైఎండ్‌ ఐటీ స్కిల్‌ వర్సిటీ'

2020-2023 పారిశ్రామిక విధానంపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'అచ్చెన్న అరెస్టు ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిదర్శనం'

మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని బలవంతంగా జైలుకు తరలించడాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. అచ్చెన్న అరెస్టు విషయం ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిదర్శనం అని వారు మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌పై మూడో విడత విచారణ

ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌పై మండలి ఛైర్మన్‌ వద్ద మూడో విడత విచారణ జరిగింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు శివనాథరెడ్డి, పోతుల సునీత అనర్హత పిటిషన్‌పై ఆన్‌లైన్‌లో మండలి ఛైర్మన్ షరీఫ్ విచారణ చేపట్టారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • గ్రామ వాలంటీర్​పై దాడి

కడపజిల్లా పులివెందులలో పనిచేస్తున్న గ్రామ వాలంటీర్​పై వైకాపా నాయకుడు దాడి చేశారు. పింఛను పంపిణీ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'విదేశీ తబ్లీగీలకు ఉత్తర్వులు '

తబ్లీగీ జమాత్​ కార్యకలాపాల్లో పాల్గొన్న 2,500 మందికిపైగా విదేశీయుల వీసాల రద్దు, 10 ఏళ్లపాటు నిషేధంపై వ్యక్తిగతంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు సుప్రీం కోర్టుకు తెలిపింది కేంద్రం. క్రిమినల్​ అభియోగాలు ఉన్నాయని, వాటిపై విచారణ జరుగుతున్నందున ఎవరూ స్వదేశానికి వెళ్లలేదని వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • తెల్లకోటు వీరులు

వైద్యుణ్ని సాక్షాత్తు నారాయణ స్వరూపంగా భావించే సనాతన సంస్కృతి మనది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో- ఆ భావన ఎంతటి విశిష్టమైనదో, వారి విధ్యుక్తధర్మ నిర్వహణలో దాగిన దైవాంశ ఏమిటో ఎందరికో ఇప్పుడు అనుభవపూర్వకంగా బోధపడుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మయన్మార్​లో దుర్ఘటన

మయన్మార్​లోని కాచిన్​లో ఘోర ప్రమాదం సంభవించింది. జాడే మైనింగ్​లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 113 మంది వరకు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కరోనా యోధులకు ఇండిగో బంపర్​ ఆఫర్

కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్న వైద్యులు, నర్సులకు ఇండిగో ఎయిర్​లైన్స్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. తమ విమానాల్లో ప్రయాణించాలనుకునే వైద్య సిబ్బందికి 25 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఆస్ట్రేలియా ఫస్ట్​క్లాస్​ క్రికెట్​ కోసం ఆ బంతి

ఈ ఏడాది ఫస్ట్​క్లాస్​ క్రికెట్​లో డ్యూక్స్​ బంతికి బదులుగా కూకబుర్రాను ఉపయోగించనున్నామని ఆస్ట్రేలియా ప్రకటించింది. గతేడాది షెఫీల్డ్​ టోర్నీలో స్పిన్నర్లు బాగా రాణించలేకపోవడం వల్లే బంతిని మార్చాలనుకున్నట్లు ఆ దేశ క్రికెట్​ బోర్డు ఆపరేషన్స్​ హెడ్​ పీటర్​ రోచ్​ తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అక్షయ్​కు హీరోయిన్​ దొరికేసింది

ప్రముఖ కథానాయకుడు అక్షయ్ కుమార్ 'బెల్​బాటమ్' సినిమాలో వాణీ కపూర్​ హీరోయిన్​గా ఖరారైంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details