ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

.

5pm_Bharat Topnews
ప్రధాన వార్తలు @ 5PM

By

Published : Jul 24, 2020, 5:01 PM IST

  • న్యాయ సలహా తీసుకుంటున్న గవర్నర్

ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపిన రాజధాని బిల్లులపై... రాజ్ భవన్ న్యాయసలహాలు తీసుకుంటుంది. సీనియర్ అడ్వకేట్స్ అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటుంది. ప్రభుత్వం నుంచి బిల్లులు అందగానే ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అవమానంతో ఆత్మహత్య

అనంతపురం జిల్లా ముప్పలకుంటలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా వచ్చిందంటూ గ్రామస్థులు అవహేళన చేశారు. గ్రామం విడిచి వెళ్లాలంటూ గ్రామ పెద్దలు హుకుం జారీ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అదనంగా రూ.వెయ్యి కోట్లు: సీఎం జగన్​

రాష్ట్రంలో కరోనా రోగులకు చికిత్స అందించేందుకు మరిన్ని ఆస్పత్రులు అందుబాటులోకి తెస్తామని సీఎం జగన్​ వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో కరోనా చికిత్స కోసం అదనంగా రూ.1,000 కోట్లు కేటాయిస్తామని అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • పగలే నగల దుకాణంలో చోరీ

విజయవాడ కాటూరి వారి వీధిలో ఓ నగల దుకాణంలో భారీ దోపిడి జరిగింది. షాపు గుమాస్తా కాళ్లు, చేతులు కట్టేసి సుమారు ఏడు కేజీల బంగారం, 30 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'నా భర్తను నేనే కాల్చి చంపేదానిని'

ఉత్తర్​ప్రదేశ్​ గ్యాంగ్​స్టర్ వికాస్​ దుబేను పోలీసులు ఎన్​కౌంటర్​ చేయకపోతే... తానే కాల్చి చంపేదానినని అన్నారు అతడి భార్య రిచా. వికాస్​ మానసిక స్థితి గురించి కీలక విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సరైన సమయంలో షెడ్యూల్​

కరోనా కారణంగా వాయిదా పడిన ఉపఎన్నికల నిర్వహణ తేదీలను సరైన సమయంలో ప్రకటిస్తామని తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే మొత్తం 57 స్థానాలకు షెడ్యూల్​ ప్రకటిస్తారా లేదా ఓ లోక్​ సభ, 7 అసెంబ్లీ స్థానాలకే ఎన్నికలు నిర్వహిస్తారా అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • డోక్లాం కోసం చైనా ఆరాటం!

భారత్​తో పరోక్ష దౌత్య యుద్ధానికి చైనా తెరతీసింది. భారత్​తో సన్నిహిత సంబంధాలున్న దేశాలను మభ్యపెడుతోంది. తాజాగా తన దృష్టిని భూటాన్​పైకి మళ్లించింది. దౌత్యపరమైన సంబంధాలు ఏర్పర్చుకునేలా భూటాన్​పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఇకపై 'ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌'

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్.. హోల్​ సేల్ వ్యాపారల సంస్థ వాల్​మార్ట్​ ఇండియాను కొనుగోలు చేసింది. భారత్​లో హోల్​ సేల్ వ్యాపారాలకు పెరుగుతున్న డిమాండ్​ను అందిపుచ్చుకునేందుకు ఈ కొనుగోలు జరిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సమయం ఆసన్నమైంది

కరోనా సంక్షోభ సమయంలోనూ ఇంగ్లాండ్​-వెస్టిండీస్​ జట్లు విజ్డెన్​ ట్రోఫీ కోసం పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 1-1తో సిరీస్​ సమం కాగా.. నేడు ప్రారంభమైన నిర్ణయాత్మక మ్యాచ్​లో గెలిచిన జట్టు వద్ద ట్రోఫీ ఉండనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఇవి నేర్చుకోండి'

విభిన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు నటి విద్యాబాలన్. తాజాగా ఆమె హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి బయోపిక్​లో నటించారు. ఈనెల 31న ఈ చిత్రం విడుదలవుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details