ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 534 కరోనా కేసులు.. ఇద్దరు మృతి - new corona cases in ap

రాష్ట్రంలో కొత్తగా 534 కరోనా కేసులు నమోదు కాగా.. ఇద్దరు మరణించారు. ఇప్పటివరకు కరోనా పరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య కోటి పది లక్షలు దాటింది.

corona cases in state
రాష్ట్రంలో కరోనా కేసులు

By

Published : Dec 17, 2020, 7:36 PM IST

రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 534 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో మహమ్మారితో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు బాధితుల సంఖ్య 8 లక్షల 77 వేల 348 కి చేరగా.. 7 వేల 69 మంది వైరస్​ సోకి మరణించారు. కరోనా నుంచి 498 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8.65లక్షలకు చేరింది. ప్రస్తుతం 4 వేల 4 వందల 54 యాక్టివ్​ కేసులున్నాయి. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 63 వేల 8 వందల 21 మందికి కొవిడ్​ పరీక్షలు నిర్వహించగా..మొత్తం పరీక్షల సంఖ్య కోటీ పదిలక్షలు దాటాయి.

కరోనాతో మరణించిన వారిలో అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.

జిల్లాల వారీగా కేసులు:

చిత్తూరు- 130, కృష్ణా- 74, గుంటూరు- 54, పశ్చిమ గోదావరి- 51, తూర్పుగోదావరి- 45, శ్రీకాకుళం- 39, విశాఖ- 31, కడప- 27, నెల్లూరు- 21, ప్రకాశం- 19, అనంతపురం- 16, విజయనగరం- 14, కర్నూలు- 13

ఇదీ చదవండి:అవసరమైతే కోర్టు ధిక్కరణ చర్యలకు వెనకాడబోం: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details