రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 647కు చేరింది. ఒక్క కర్నూలు జిల్లాలోనే కొత్తగా 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. కృష్ణా జిల్లాలో 6, తూర్పు గోదావరి జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 3 కొత్త కేసులు నిర్థరణ అయినట్లు హైల్త్ బులెటిన్లో ప్రకటించింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 565 మంది చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. కర్నూలు జిల్లాలో కొవిడ్తో ఒకరు మరణించారని... రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 17కు చేరినట్లు వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 23 మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది.
కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు.. ఒకరు మృతి - coronavirus death toll in ap
![కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు.. ఒకరు మృతి corona cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6852279-952-6852279-1587276268946.jpg)
corona cases
Last Updated : Apr 19, 2020, 11:39 AM IST