ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM - ap top ten news

..

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM

By

Published : Jun 28, 2022, 2:59 PM IST

  • LOKESH: అందరూ అయిపోయారు.. ఇక పాత్రికేయులపైనా..: లోకేశ్
    LOKESH ON JOURNALIST ATTCK: శ్రీకాళహస్తి రాజీవ్​నగర్ వద్ద జర్నలిస్ట్ ఈశ్వర్​పై వైకాపా నేతల దాడిని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. ప్రతిపక్షాలు, ప్రజలు, అధికారులపై దాడులు అయిపోగా.. ఇప్పుడు పాత్రికేయుల వంతు వచ్చిందా అని ఆక్షేపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • YSRCP COLOURS TO PHC: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మళ్లీ అవే రంగులు
    YSRCP COLOURS TO PHC: త్వరలో ప్రారంభించనున్న వైద్యశాలకు రాజకీయ రంగులు వేయడం బాపట్ల జిల్లాలో చర్చనీయాంశమైంది. అధికార భవనాలకు పార్టీ రంగులు వేయడంపై ఇప్పటికే పలుమార్లు న్యాయస్థానాల్లో చుక్కెదురైనా.. అధికార పార్టీ నాయకుల్లో స్పందన లేకపోవడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆస్తి కోసం... అన్నను చంపించిన చెల్లెలు.. సహకరించిన తల్లి
    Man killed for property: సమాజంలో బంధాలు, బంధుత్వాలు కనుమరుగైపోతున్నాయి. ఆస్తుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు... ఆఖరికి కన్నవారినైనా.. కడుపులో పుట్టినవారినైనా కడతేర్చేందుకు వెనకాడడం లేదు. క్షణికావేశం, ఆశతో హత్యలు చేసి.. అటు ఆ కుటుంబాలను.. ఇటు వీళ్ల కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జువెనైల్‌ హోం నుంచి అయిదుగురు పరారీ.. ఎలాగంటే..!
    Five Boys Escape from Juvenile Home: మూత్రశాల గోడకు కన్నం పెట్టి జువెనైల్‌ హోం నుంచి అయిదుగురు బాలురు వెళ్లిపోయారు. ఈ ఘటన సోమవారం నిజామాబాద్​లో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సముద్రం మధ్యలో హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. లక్కీగా 9 మంది...
    ఓఎన్​జీసీ హెలికాప్టర్​ను సముద్రంలో ఎమర్జెన్సీ ల్యాండ్​ చేశారు సిబ్బంది. ఘటన జరిగిన సమయంలో అందులో పైలట్లు సహా తొమ్మిది మంది ఉన్నారు. వీరిలో ఆరుగురిని అధికారులు రక్షించారు. మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మూడేళ్ల బాలుడిపై 15 కుక్కలు దాడి.. శరీర భాగాలను వేరు చేసి..
    కుక్కల దాడిలో మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఒకేసారి 15 శునకాలు బాలుడిపై దాడి చేసి శరీర భాగాలను వేరు చేశాయి. మరో ఘటనలో.. నవజాత శిశివును ఆస్పత్రి నుంచి కుక్క ఎత్తుకెళ్లిపోయి చంపేసింది. హృదయవిదారకమైన ఈఘటనలు ఎక్కడ జరిగాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సరిహద్దు దాటుతున్న ట్రక్కులో 46 మృతదేహాలు.. పోలీసులు హైఅలర్ట్
    మెక్సికోలోని శాన్​ ఆంటోనియోలో ఓ ట్రక్కులో మృతదేహాలు లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. రిమోట్​ బ్యాక్​ రోడ్డులో వెళ్తున్న ఆ ట్రక్కులో 46 మృతదేహాలను గుర్తించారు అధికారులు. ట్రక్కులో ఉన్న మరో 16 మందిని అధికారులు శాన్​ ఆంటోనియాలోని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వ్యాపార దిగ్గజం 'పల్లోంజీ మిస్త్రీ' కన్నుమూత.. మోదీ సంతాపం
    Shapoorji Pallonji Mistry: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్​ ఛైర్మన్​ పల్లోంజీ మిస్త్రీ గత రాత్రి కన్నుమూశారు. ఈయనకు నలుగురు సంతానం. పారిశ్రామిక రంగానికి చేసిన సేవలకుగానూ 2016లో మిస్త్రీకి.. పద్మభూషణ్​ అవార్డు ఇచ్చింది కేంద్రం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రోహిత్‌ హెల్త్​పై 'సమైరా‌' అప్‌డేట్‌.. ముద్దుముద్దు మాటలతో...
    ఇటీవలే కొవిడ్​ బారిన పడిన టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ.. ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్నాడు. ఈ క్రమంలో రోహిత్ కుమార్తె సమైరా శర్మ.. మద్దుముద్దు మాటలతో తనకు తెలిసిన హెల్త్​ అప్డేట్​ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మీరూ ఓ సారి చూసేయండి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సమంత మరో స్పెషల్​ సాంగ్​.. 'ఊ అంటవా మావా..'ను మించేలా?
    'పుష్ప'లో 'ఊ అంటవా మావా..' పాటతో ఊపుఊపేసింది అగ్రతార సమంత. మరోసారి అలాంటి స్పెషల్ గీతంలో ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. సందీప్ వంగ దర్శకత్వంలో రణ్​బీర్ కపూర్ నటిస్తున్న 'యానిమల్' చిత్రంలో సామ్ స్పెషల్ సాంగ్ చేసే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details