ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3PM

..

By

Published : Jun 23, 2020, 3:00 PM IST

TOP NEWS
TOP NEWS

  • 'స్పందన'పై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
    'స్పందన' కార్యక్రమం అమలు తీరుపై కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • పాలకులు చేసిన పాపాలకు.. పట్టిసీమ నీళ్లు చల్లుకోవాలి
    పాలకులు.. తాము చేసిన పాపాలను పట్టిసీమ నీళ్లు చల్లుకుని కడుక్కోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా గోదారి నీరు ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమానికి చేరుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • పది వేలకు చేరువలో కరోనా కేసులు
    గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 462 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 9,834కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • పరీక్షలు రద్దు చేయండి
    రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న కారణంగా... డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల ఆఖరి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం సరి కాదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • చరిత్రలో తొలిసారి ఇలా...
    ఒడిశా పూరిలో జగన్నాథ రథయాత్ర ఉత్సవం ప్రారంభమైంది. ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే ఈ ఉత్సవంలో.. ఈ ఏడాది పుజారులు, సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు. సుప్రీం ఆదేశానుసారం ఏడు రోజులు మాత్రమే రథయాత్ర నిర్వహించనున్నారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఆలోచన భేష్​.. నేలమ్మకు కొబ్బరినార చీర
    నేలమ్మను కాపాడుకునేందుకు కొబ్బరి పీచు, నారలతో నేసిన పర్యావరణహిత వస్త్రాన్ని సిద్ధం చేసింది కేరళ ప్రభుత్వం. ఈ భూవస్త్రాన్ని రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆనకట్టలుగా పరిచి వర్షాకాలంలో నేలకోత నివారణకు పూనుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • అమెజాన్​లోనూ ఇక మద్యం హోం డెలివరీ!
    ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మద్యం హోం డెలివరీకి సిద్ధమైంది. ఇందుకోసం అమెజాన్​కు బంగాల్​ ప్రభుత్వం అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. నిత్యావసరాల హోం డెలివరీ సంస్థ బిగ్​బాస్కెట్​కూ ఈ తరహా సేవలకు అనుమతి లభించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'వీసా' దెబ్బతో నష్టం ఎవరికి? లాభపడేదెవరు?
    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే. తాజాగా హెచ్​-1బీ, ఎల్​-1 వీసాలు నిలిపివేస్తున్నట్టు ఆయన చేసిన ప్రకటన కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'టెస్టుల్లో రాహుల్​కు కీపింగ్ బాధ్యతలు ఇవ్వొద్దు'
    టెస్టుల్లో కేఎల్​ రాహుల్​ను వికెట్​ కీపర్​గా మార్చొద్దని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. సుదీర్ఘ ఫార్మాట్​లో కీపర్లకు షిఫ్టింగ్ పద్ధతి సరైనది కాదని తెలిపాడు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • శిల్పారెడ్డికి కరోనా.. సామ్​-చైతూల్లో భయం!
    అక్కినేని ఫ్యామిలీ స్టార్​ కపుల్​ సమంత-నాగచైతన్యకు కరోనా సోకుతుందేమోనన్న భయాలు అభిమానుల్లో నెలకొంది. తాజాగా కరోనా నిర్ధరణ అయిన ప్రముఖ ఫ్యాషన్​ డిజైనర్​ శిల్పారెడ్డితో సామ్​ సన్నిహితంగా ఉండటమే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details