ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 15, 2021, 9:43 AM IST

ETV Bharat / city

SRISAILAM DAM: శ్రీశైలం డ్యామ్‌కు మొదలైన కృష్ణమ్మ ప్రవాహం

నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఎగువ నుంచి వస్తున్న వరద ప్రభావంతో జలాశయాల్లో నీటి మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ సీజన్​లో కృష్ణానదిలో శ్రీశైలం డ్యామ్​కు నీటి ప్రవాహం పోటెత్తింది.

srisailam
srisailam

కృష్ణా నదిలో శ్రీశైలం డ్యామ్‌కు 17,360 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. సోమవారం జలాశయంలో 37.51 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువున ఆలమట్టికి 3,205 క్యూసెక్కులు, నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 3,743, జూరాలకు 13,655 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.

జూరాలలో విద్యుత్​ ఉత్పత్తి అనంతరం దిగువకు 11,091 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గోదావరి పరీవాహకంలో సింగూరు జలాశయానికి 1,754 క్యూసెక్కులు, ఎల్లంపల్లి జలాశయానికి 1,467 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.

ABOUT THE AUTHOR

...view details