ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 1,730 కరోనా కేసులు.. 5 మరణాలు - ఏపీలో పెరుగుతున్న కొవిడ్ కేసులు

1,730 new corona cases in AP
ఏపీలో మరో 1,730 కరోనా కేసులు

By

Published : Apr 4, 2021, 5:20 PM IST

Updated : Apr 4, 2021, 5:58 PM IST

17:15 April 04

ఏపీలో పెరిగిన కొవిడ్ తీవ్రత

ఏపీలో పెరిగిన కొవిడ్ తీవ్రత

ఏపీలో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,072 నమూనాలను పరీక్షించగా 1,730 మందికి కొవిడ్‌ నిర్ధరణ అయ్యింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 378, పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 10 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,07,676కి చేరింది. 

24 గంటల వ్యవధిలో కొవిడ్‌ చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,239కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 842 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 10,300 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,52,08,436 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.  

ఇదీ చదవండి: 

గ్రామంలో అథ్లెటిక్స్​కు శిక్షణ..శభాష్​ అనిపించుకుంటున్న యువకుడు

Last Updated : Apr 4, 2021, 5:58 PM IST

ABOUT THE AUTHOR

...view details