ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 26, 2021, 10:17 PM IST

ETV Bharat / city

Telangana Corona: కరోనా తగ్గుముఖం... తెలంగాణలో కొత్తగా 170 కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి (Telangana Corona) తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా 170 మందికి కరోనా నిర్ధరణ అయింది. 24 గంటల్లో 34,200 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

కరోనా
కరోనా

తెలంగాణ రాష్ట్రంలో కరోనా (Telangana Corona) ప్రభావం తగ్గుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య తగ్గుతోంది. ఇవాళ కొత్తగా 170 మందికి కరోనా నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 6,65,068కి చేరుకుంది. మహమ్మారితో ఇప్పటివరకు 3,912 మంది మరణించారు. కరోనా నుంచి 259 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 4,612 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 34,200 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

దేశంలో..

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య (Corona cases in India) స్వల్పంగా తగ్గాయి. తాజాగా 28,326 మందికి కొవిడ్​ (Coronavirus update) పాజిటివ్​గా తేలింది. మరో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 26,032 మంది వైరస్​ను జయించారు.

ఇదీ చూడండి:

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,184 కరోనా కేసులు.. 11 మరణాలు

ABOUT THE AUTHOR

...view details