ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 16, 2020, 9:35 AM IST

ETV Bharat / city

తెలంగాణలో 2లక్షల19వేలు దాటిన కొవిడ్ బాధితులు

తెలంగాణలో కొత్తగా 15వందల 54మందికి కరోనా నిర్ధరణ అయింది. వైరస్​తో 7 మంది మృతి చెందారు.

1554-new-corona-cases-registered-in-telangana
తెలంగాణలో 2లక్షల19వేలు దాటిన బాధితులు

తెలంగాణలో మరో 15వందల 54మందికి కరోనా నిర్ధరణ అయింది. ఒకే రోజు 7మంది వైరస్‌తో మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 2లక్షల 19వేల 224కి చేరింది.

మహమ్మారితో ఇప్పటివరకు 12వందల 56 మంది బలయ్యారు. మరో 14 వందల35 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకోగా.... మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య లక్షా 94వేల 653 మందికి చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 23వేల 203 యాక్టివ్ కేసులుండగా... 19వేల 251 మంది బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 249 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details