ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 30, 2020, 9:59 AM IST

ETV Bharat / city

తెలంగాణలో 2 లక్షల 37 వేలు దాటిన కరోనా కేసులు

తెలంగాణలో మరో 1,531 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్​తో ఆరుగురు మృతి చెందారు.

1531-new-corona-cases-found-in-telngana
తెలంగాణలో మరో 1,531 కొవిడ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 1,531 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయింది. ఇప్పటివరకు 2 లక్షల 37 వేల 187 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి మరో ఆరుగురు మృతిచెందగా... మొత్తం 1,330 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,048 మంది కరోనాను జయించారు.

ఇప్పటివరకు కొవిడ్‌ నుంచి 2 లక్షల 17 వేల 401 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18, 456 యాక్టివ్ కేసులున్నాయి. 15, 425 మంది హోం ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 293 కరోనా కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details