ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు11am

..

By

Published : Aug 13, 2022, 10:59 AM IST

Updated : Aug 13, 2022, 11:25 AM IST

11am topnews
ప్రధానవార్తలు9am

  • ‘ఇంపాక్ట్‌’ భారం రూ.600 కోట్లు

పెరుగుతున్న భవన నిర్మాణ సామగ్రి ధరలకు ఇంపాక్ట్‌ ఫీజు తోడవ్వడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి నిర్మాణం కలగానే మిగిలిపోయేలా ఉంది. ఇళ్ల నిర్మాణ అనుమతుల కోసం ఇప్పటికే 7-10 రకాల ఫీజుల కింద లక్షల రూపాయలు పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఇంపాక్ట్‌ ఫీజు పేరుతో అదనపు భారం పడనున్నందున ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టర్న్‌కీ చెప్పిందే లెక్క

సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్లో విక్రయిస్తానంది. ఆర్టీసీ బస్సుల్లో యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ ద్వారా కండక్టర్లు ఆన్‌లైన్‌ టికెట్ల జారీ ఆరంభించారు. గనుల శాఖలో ఉమ్మడి రాష్ట్రం నుంచే ఆన్‌లైన్‌ వేబిల్లుల విధానం మొదలైంది. కానీ.. ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేస్తున్న టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌ (జేపీ సంస్థకు ఉపగుత్తేదారు)కు గనులశాఖ ఈ-పర్మిట్లు ఇవ్వట్లేదు. ఆ సంస్థ ఇసుక రవాణాదారులకు ఆన్‌లైన్‌ వేబిల్లులకు బదులు ముద్రిత బిల్లులే ఇస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వాయిదాల్లో బకాయిల చెల్లింపు

పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన రూ.7 వేల కోట్ల బకాయిలను డిస్కంలు 12 వాయిదాల్లో చెల్లించనున్నాయి. దీని ప్రకారం ప్రతి నెలా సుమారు రూ.600 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు భారీగా ఉన్న బకాయిలను ఒకేసారి చెల్లించడం డిస్కంలకు భారంగా మారుతున్న ఉద్దేశంతో వాయిదా పద్ధతిలో చెల్లించేలా వెసులుబాటు కల్పించడానికి లేట్‌ పేమెంట్‌ స్కీమ్‌ (ఎల్‌పీఎస్‌)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రోడ్డు ప్రమాదంలో గాయపడి.. కాపాడాలంటూ 40 నిమిషాలు ఆర్తనాదాలు

మినీ లారీ ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో క్లీనర్‌ మృతిచెందిన సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు కోల్డ్‌స్టోరేజి సమీపంలో శుక్రవారం జరిగింది. టమాటాల లోడుతో మదనపల్లె నుంచి నర్సీపట్నం వెళుతున్న లారీ కోల్డ్‌స్టోరేజీ సమీపంలో ఆగింది. కడప జిల్లా పోరుమామిళ్ల నుంచి ప్రకాశం జిల్లా కనిగిరికి పాలు, పెరుగు లోడుతో వెళుతున్న మినీ లారీ తెల్లవారుజామున 4:40 గంటల సమయంలో వేగంగా ఢీకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నీట్‌, జేఈఈ విలీనం.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే

విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు యూజీసీ సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. నీట్, జేఈఈ, సీయూఈటీ పరీక్షలను విలీనం చేయాలని భావిస్తోంది. మార్కులను బట్టి విభిన్న కోర్సుల్లో చేరే వెసులుబాటు కల్పించనున్నట్లు యూజీసీ ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో స్థిరంగా కరోనా.. మరో 15 వేల మందికి వైరస్

దేశంలో కరోనా వ్యాప్తి స్థిరంగా ఉంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం 8 గంటల వరకు 15,815 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. 68 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 4.36 శాతానికి తగ్గింది. 24 గంటల వ్యవధిలో కొవిడ్​ నుంచి 20,018 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.54 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.27 శాతానికి పడిపోయాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరవు కథాచిత్రం.. ఎండిన నదులు, చెరువులు.. 500 ఏళ్లలో లేని దుర్భర పరిస్థితులు

EUROPE DROUGHT: ఐరోపా ఖండం కరవు గుప్పిట చిక్కుకుని విలవిల్లాడుతోంది. గత 500 ఏళ్లలో ఎన్నడూ లేనంత దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. పశువులు తినేందుకు పచ్చగడ్డి, తాగేందుకు నీరు సైతం వెతుక్కోవాల్సి వస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వృద్ధి పథంలో ఆర్థిక రథం త్వరలోనే 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి

మన ఐటీ ఔషధ వాహన రంగాలు దూసుకెళుతున్న తరుణంలో ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​ ఆవిర్భవిస్తోందనే ఆశలు రేకెతున్నాయి. స్వావలంబన దిశగా పయనమవుతుండగా అదే సమయంలో పేదరికం నిరుద్యోగం సమస్యలు భారత్​ను వెంటాడుతున్నాయి. ఈ స్వాతంత్య్ర అమృత మహోత్సవాల వేళ మన ఆర్థిక రంగ ప్రగతి ప్రస్థానాలపై ప్రత్యేక కథనం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మహిళల ఐపీఎల్​కు టైమ్​ ఫిక్స్​.. ఎప్పుడంటే?

ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న మహిళల భారతక్రికెట్‌ లీగ్‌ వచ్చే సీజన్‌ నుంచే కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళల క్రికెట్‌కు గత కొన్నేళ్లలో ఆదరణ ఎంతో పెరిగిన నేపథ్యంలో వాళ్లకూ భారత క్రికెట్‌ లీగ్‌ నిర్వహిస్తే అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుందని, భారత జట్టుకు కూడా అది మేలు చేస్తుందనే అభిప్రాయాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రెండో పెళ్లిపై నటి సురేఖ క్లారిటీ.. అలాంటి బాయ్​ఫ్రెండ్​ కావాలంటూ..

తల్లిగా, చెల్లిగా, అక్కగా, వదినగా ఇలా ఎన్నో గుర్తండిపోయే పాత్రల్లో టాలీవుడ్​ ప్రేక్షకులను పలకరించారు నటి సురేఖా వాణి. ఇప్పుడు కాస్త సినిమాల్లో జోరు తగ్గించినా సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్​గా ఉంటున్నారు. కూతురు సుప్రితతో కలిసి లైఫ్​ను సరదాగా గడుపుతూ వాటికి సంబంధించిన పోస్ట్​లను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Aug 13, 2022, 11:25 AM IST

ABOUT THE AUTHOR

...view details