ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు..13 మంది మృతి

By

Published : Jul 7, 2020, 2:42 PM IST

Updated : Jul 7, 2020, 3:08 PM IST

corona positive-cases
corona positive-cases

14:40 July 07

రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు..13 మంది మృతి

హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో  కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,178 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో రాష్ట్రానికి సంబంధించి 1,155 మంది, ఇతర ప్రాంతాల నుంచి వారు 23 మందికి సోకినట్లు పేర్కొంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 21,197కి చేరింది.

వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 11,200 మంది చికిత్స పొందుతుండగా.. 9,745 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. కొవిడ్‌తో ఇవాళ ఒక్క రోజే 13 మంది మృతి చెందారు. కరోనా వైరస్‌తో కర్నూలులో 4, అనంతపురం 3, చిత్తూరు, విశాఖపట్నంలో ఇద్దరేసి, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో 252 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 16,238 సాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండి:

వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న పశువులు

Last Updated : Jul 7, 2020, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details