ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / business

ఏప్రిల్‌ 1 నుంచి సరళీకృత జీఎస్‌టీ విధానం: నిర్మలా సీతారామన్​ - central finance minister nirmala sitharaman tour in hyderabad

జీఎస్‌టీలో సరళీకృత విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. చిన్నతరహా పారిశ్రామికవేత్తలతో హైదరాబాద్​లో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

nirmala seetharaman
nirmala seetharaman

By

Published : Feb 16, 2020, 6:00 PM IST

ఏప్రిల్‌ 1 నుంచి సరళీకృత జీఎస్‌టీ విధానం: నిర్మలా సీతారామన్​

ఏప్రిల్‌ 1 నుంచి సరళీకృత జీఎస్‌టీని పూర్తిస్థాయిలో వర్తింపజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. హైదరాబాద్​లోని ఓ హోటల్లో చిన్నతరహా పారిశ్రామికవేత్తల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠిలో ఆర్థిక మంత్రి పాల్గొన్నారు. జీఎస్‌టీకి సంబంధించిన సందేహాలు, సమస్యలను నివృత్తి చేయడానికి కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్‌ బోర్డు బృందం ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనుందని తెలిపారు.

ఇదీ చూడండి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details