ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

వైకాపా శాసనసభాపక్ష నేతగా జగన్ ఏకగ్రీవం - జగన్

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఆపార్టీ అధినేత వైఎస్ జగన్​ను ఎన్నుకున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు జగన్​ను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

వైకాపా శాసనసభాపక్ష నేత జగన్

By

Published : May 25, 2019, 11:51 PM IST

వైకాపా శాసనసభాపక్ష నేత జగన్

వైకాపా శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత జగన్​ను... ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, కరుణాకర్​రెడ్డి, శ్రీకాంత్​రెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. జగన్​ను శాసనసభపక్షా నేతగా ఎన్నుకోవాలని బొత్స ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యేలు పార్థసారధి, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రరెడ్డి బలపర్చారు. సమావేశానికి ముందు ఎమ్మెల్యేలంతా జగన్​ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేలందరికి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆ పార్టీ నేతలు బొత్స, ధర్మాన, బుగ్గన హైదరాబాద్ వెళ్లి గవర్నర్​ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు జగన్​ను ఆహ్వానించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details