వైకాపా...
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా మహిళా అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు.వైకాపా తరపున15మంది పోటీ చేయగా13మంది విజయం సాధించారు.అత్యధికంగా గుంటూరు జిల్లాలో వైకాపా నుంచి ముగ్గురు మహిళా అభ్యర్థులు గెలుపొందారు.నగరి నుంచి ఆర్.కె.రోజా,పాతపట్నం నుంచి రెడ్డి శాంతి,పాలకొండ(ఎస్టీ)నుంచి విశ్వసరాయ కళావతి,కురుపాం(ఎస్టీ)నుంచి పాముల పుష్పా శ్రీవాణి,పాడేరు(ఎస్టీ)నుంచి కె.భాగ్యలక్ష్మి,రంపచోడవరం(ఎస్టీ)నుంచి నాగులపల్లి ధనలక్ష్మి,కొవ్వూరు(ఎస్సీ)నుంచి తానేటి వనిత,ప్రత్తిపాడు(ఎస్సీ)నుంచి మేకతోటి సుచరిత,చిలకలూరిపేట నుంచి విడదల రజిని,పత్తికొండ నుంచి కె.శ్రీదేవి,సింగనమల(ఎస్సీ)నుంచి జొన్నలగడ్డ పద్మావతి,కళ్యాణదుర్గం నుంచి కేవీ ఉషా శ్రీచరణ్ ఎన్నికల బరిలో దిగి గెలుపొందారు.
తెదేపా....
ఇక తెదేపా నుంచి19మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా వారిలో రాజమహేంద్రవరం నగర అభ్యర్థి ఆదిరెడ్డి భవాని ఒక్కరే విజయం సాధించారు.