ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

దిల్లీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు - ttd-bramostavalu

దిల్లీలో తితిదే ఆధ్వర్యంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి శ్రీవార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ttd

By

Published : May 14, 2019, 1:00 PM IST

దిల్లీలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో రేపట్నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. తితిదే ఆధ్వర్యంలో స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. 11 రోజులపాటు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలకు తితిదే అన్ని ఏర్పాట్లు చేసింది. గోల్ మార్కెట్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో 11 రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం అంకురార్పణతో ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు...మే 20న గరుడ వాహనసేవ, మే 23న స్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. మే 25న పుష్పయాగంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details