ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మంగళగిరిలో తెదేపా నేత దారుణ హత్య

గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా నేత ఉమాయాదవ్​ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపారు.

By

Published : Jun 25, 2019, 10:07 PM IST

Updated : Jun 25, 2019, 11:31 PM IST

నడిరోడ్డుపై తెదేపా నేత నరికి చంపిన దుండగులు

నడిరోడ్డుపై తెదేపా నేత నరికి చంపిన దుండగులు

రాష్ట్రంలో తెదేపా నేతల మీద దాడులు.. హత్యల వరకూ వెళ్లాయి. మంగళగిరికి చెందిన తెదేపా నేత తాడిబోయిన ఉమాయాదవ్​ను... గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హత్యచేశారు. స్థానికులు చూస్తుండగానే ముగ్గురు వ్యక్తులు కత్తులతో పొడిచి చంపి పారిపోయారు. పాతకక్షతోనే ఉమాయాదవ్​పై దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడిపై గతంలో హత్య కేసు ఉందన్న పోలీసులు.... ఉమాయాదవ్​ మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల అనుచరుడిగా తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హంతకుల కోసం గాలిస్తున్నారు.క్లూస్ టీమ్‌ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించింది. శవపంచనామా కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Jun 25, 2019, 11:31 PM IST

ABOUT THE AUTHOR

...view details