ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ప్రమాదాలకు అడ్డాగా మారుతోన్న శ్రీశైలం ఘాట్ రోడ్డు

శ్రీశైలం మల్లన్నస్వామి దైవస్థానానికి వెళ్లే భక్తులకు, శ్రీ శైలం ప్రాజెక్టు, నల్లమల అటవీ అందాల వీక్షణ వచ్చే పర్యాటకులకు, దోర్నాల - శ్రీశైలం ఘాట్‌ రోడ్డే ఆధారం. నిత్యం రద్దీగా ఉండే  ఈ ఘాట్‌ రోడ్డులో ప్రమాదాలు పరిపాటైపోయాయి. ప్రయాణం ప్రమాదం మారుతున్న  ఈ రోడ్డు నిర్మాణ లోపాలను సవరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

By

Published : Jun 14, 2019, 6:41 AM IST

ప్రమాదాలకు అడ్డాగా మారుతోన్న శ్రీశైలం ఘాట్ రోడ్డు

ప్రమాదాలకు అడ్డాగా మారుతోన్న శ్రీశైలం ఘాట్ రోడ్డు
ప్రకాశం జిల్లా పెద దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్ళే ఘాట్‌ రోడ్డు ప్రయాణం నిత్యం ఏదొక ప్రమాదానికి కారణమౌతోంది. ఆర్టీసీ బస్సులతో పాటు, జీపులు, కార్లు, టూరిస్టు బస్సులతో నిత్యం భక్తులు, పర్యాటకులు శ్రీ శైలానికి వచ్చి పోతుంటారు. డోర్నాల నుంచి శ్రీ శైలం దేవాలయానికి మధ్య ఉన్న సుమారు 50 కిలోమీటర్లు ఉండే ఈ రహదారి భద్రతా ప్రమాణాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఒకే రోడ్డులో రాకపోకలు జరగడం వలన తరచూ ప్రమాదాలు సంభవిస్తోన్నాయి. ఒకే వరుస రహదారి కావడం, ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక సూచికలు, ప్రమాద నివారణ ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు అంటున్నారు.

ఈ ఘాట్‌ రోడ్డుకు ఒకవైపు లోయ, మరో వైపు కొండ ప్రాంతం ఉంటుంది. లోయ వైపున రక్షణగోడ నిర్మించారు. అయితే ఈ గోడ శిథిలావస్థకు చేరుకుంది. కొన్ని చోట్ల ఎత్తు తక్కువుగా ఉండటం వల్ల వాహనం అదుపు తప్పినా అడ్డుకునే సామర్థ్యం లేకుండా పోతుంది. రేడియం స్టిక్కర్ల స్థంభాలు చాలా చోట్ల విరిగిపోయి పడి ఉన్నాయి. కొండ వైపు రక్షణ చర్యలు లేవు. వర్షాలు కురిస్తే కొండ చెరియలు విరిగిపడి రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. ప్రమాదాలను నివారించేందుకు అధికారులు రక్షణ చర్యలు, రోడ్డు విస్తరణ చేపట్టాలని అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details