ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

వివేకా హత్యకేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు - remand_extention

వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులకు పులివెందుల కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. నిందితుల విజ్ఞప్తిని అంగీకరిస్తూ పులివెందుల సబ్‌జైలుకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

viveka

By

Published : May 20, 2019, 5:02 PM IST

వివేక హత్యకేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు

మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులకు జూన్‌ 3 వరకూ మరోసారి రిమాండ్‌ పొడిగిస్తూ పులివెందుల కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్‌ వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారనే ఆరోపణలపై ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌ అరెస్ట్​ అయ్యారు. తమను కడప నుంచి పులివెందుల సబ్‌జైలుకు తరలించాలని వీరు ముగ్గురూ పులివెందుల కోర్టులో పిటిషన్‌ వేశారు. నిందితుల విజ్ఞప్తిని అంగీకరించిన న్యాయస్థానం.... పులివెందుల సబ్‌జైలుకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details