ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 13, 2019, 7:38 AM IST

Updated : Feb 13, 2019, 11:10 AM IST

ETV Bharat / briefs

ప్రత్యామ్నాయం ఆలస్య'మే'

బ్రెగ్జిట్​ అనంతరం బ్రిటన్​కు చేకూరే ప్రయోజనాలు, రక్షణపై.. సమాఖ్యతో చర్చించేందుకు మరింత సమయం కావాలని ప్రధాని థెరెసా మే ఎంపీలనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు మరింత సమయం కావాలని బ్రిటన్​ ప్రధాని థెరెసా మే ప్రకటించారు. మార్చి 29న ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి బ్రిటన్​ వైదొలగనున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈయూతో చర్చలు కీలక దశలో ఉన్నాయని, ఓ అర్థవంతమైన ఒప్పందానికి మార్గం సుగమం అయ్యేందుకు బ్రెగ్జిట్​ ఆమోదం పొందాలని అభిప్రాయపడ్డారు.

అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా బ్రెగ్జిట్​ ఒప్పందంలో మార్పులు చేశామని తెలిపారు థెరిసా. తదుపరి ఓటింగ్​లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వివాదాస్పదమైన ఐరిష్​ సరిహద్దు అంశంపైనా దృష్టి సారించినట్లు వెల్లడించారు.

బ్రెగ్జిట్​ అంశంపై ప్రతిపక్షాల ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్రెగ్జిట్​ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో... థెరిసా మే నిర్లక్ష్య పూరిత వైఖరి అవలంభిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Last Updated : Feb 13, 2019, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details