తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలం పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. అభివృద్ధి జరగలేదని బీఎస్పీ అధినేత మాయావతి అన్నారు.అభివృద్ధి జరగకపోవడంతోనే తెలంగాణ రాష్ట్రం కోసంఉద్యమం చేశారని తెలిపారు.రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి సరైన న్యాయం జరగలేదన్నారు.ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేకపోయారని విమర్శించారు. హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోదీ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.రాష్ట్ర ప్రజలు చంద్రబాబు, జగన్ వలలో పడవద్దని సూచించిన మాయావతి...ఏపీ ప్రజలు కొత్త నాయకత్వాన్ని ఆదరించాలని పిలుపునిచ్చారు. పవన్ వంటి యువ నాయకత్వంలో ప్రభుత్వం వస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుందని భరోసా ఇచ్చారు. పవన్ కల్యాణ్తో పాటు బీఎస్పీ, వామపక్షాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. జనసేన కూటమి అసెంబ్లీ, లోక్సభ రెండింట్లోనూ విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని... పవన్కల్యాణ్ సీఎం అవుతారని ధీమాగా చెప్పారు.
''మాయావతే ప్రధాని... పవనే ముఖ్యమంత్రి'' - మీడియా
మాయావతి ప్రధాని కావాలని దేశంలో చాలామంది కోరుకుంటున్నారని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ చెప్పారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి విశాఖలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జనసేన కూటమి అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని మాయా వ్యక్తం చేశారు.
![''మాయావతే ప్రధాని... పవనే ముఖ్యమంత్రి''](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2889243-315-9774c25a-a03d-403d-a588-d8ec30e4bfe5.jpg)
మాయావతి, పవన్ మీడియా సమావేశం
మాయావతి, పవన్ మీడియా సమావేశం
ఇవీ చదవండి..