నేడు దిల్లీలో భాజపాయేతర పక్షాల సమావేశం - చంద్రబాబు దిల్లీ పర్యటన
ఈవీఎంల వివాదం, ఎన్నికల్లో పారదర్శకతపై నేడు దిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో భాజపాయేతర పక్షాల నేతలు సమావేశం కానున్నారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరు కానున్నారు.
![నేడు దిల్లీలో భాజపాయేతర పక్షాల సమావేశం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2995396-thumbnail-3x2-opp.jpg)
దిల్లీలో ప్రతిపక్షాల భేటీ
రాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంల మొరాయింపు, ఘర్షణలను జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు.. నేడు దిల్లీలో మరో కీలక సమావేశానికి హాజరు కానున్నారు. దిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఉదయం 11 గంటల 45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు భాజపాయేతర పక్షాల సమావేశం జరగనుంది. ఈ భేటీలో చంద్రబాబు కీలకం కానున్నారు. ఈవీఎంల వివాదం, ఎన్నికల్లో పారదర్శకతపై చర్చించనున్నారు. అనంతరం.. భవిష్యత్ కార్యాచరణను పార్టీల నేతలు వివరిస్తారు.
Last Updated : Apr 14, 2019, 2:45 AM IST