దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) 2019 ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 14,10,754 మంది పరీక్షకు హాజరు కాగా...7,97,042 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 39,039 మంది ఉత్తీర్ణత సాధించగా... తెలంగాణ నుంచి 33,044 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
నీట్ ఫలితాలు.. టాప్ 50లో ఏపీకి 3 ర్యాంకులు - నీట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థికి ఏడో ర్యాంకు
నీట్ ఫలితాలను విడుదల చేసింది జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ). దేశవ్యాప్తంగా 56.27 శాతంతో 7,97,042 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాజస్థాన్ విద్యార్థి నళిన్ ఖండేల్వాల్ జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు.
![నీట్ ఫలితాలు.. టాప్ 50లో ఏపీకి 3 ర్యాంకులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3479797-1034-3479797-1559734980037.jpg)
నీట్ ఫలితాలు.. టాప్ 50లో ఏపీకి 3 ర్యాంకులు
రాజస్థాన్కు చెందిన నలిన్ ఖండేల్వాల్ అనే విద్యార్థి మొదటి ర్యాంకు, దిల్లీకి చెందిన భవిక్ బన్సాల్ అనే విద్యార్థి రెండో ర్యాంకు సాధించాడు.టాప్50లో తెలుగు రాష్ట్రాలకు నాలుగు ర్యాంకులు లభించాయి.తెలంగాణకు చెందిన జి.మాధురిరెడ్డి ఏడో ర్యాంకు సాధించగా... ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థిని ఖురేషీ హస్రా 16వ ర్యాంకు,పిల్లి భాను శివతేజకు40వ ర్యాంకు, ఎస్.శ్రీనందన్రెడ్డికి42వ ర్యాంకు సాధించారు.