ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

గిరిపుత్రుల అభివృద్ధికి కష్టపడతా: మంత్రి శ్రావణ్

విశాఖ జిల్లా అరకు నియోజకవర్గంలో మంత్రి లోకేశ్ పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ఈ పర్యటనలో మంత్రి కిడారి శ్రావణ్ పాల్గొన్నారు. గిరిపుత్రుల కోసం ప్రాణాలర్పించిన సర్వేశ్వరరావు త్యాగాన్ని గుర్తుచేసుకున్నారు.

By

Published : Mar 27, 2019, 9:44 PM IST

ఎన్నికల ప్రచారం లోకేశ్, శ్రావణ్

ఎన్నికల ప్రచారం లోకేశ్, శ్రావణ్
విశాఖ జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేటలో మంత్రి లోకేశ్ ఎన్నికల ప్రచారం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి కిడారి శ్రావణ్​తో కలిసి, లోకేశ్ రోడ్ షోలో నిర్వహించారు. శ్రావణ్ మాట్లాడుతూ తన తండ్రి కిడారి సర్వేశ్వరరావు గిరిపుత్రుల కోసం ప్రాణాలర్పించారని గుర్తుచేశారు. గిరిజనుల అభివృద్ధికి తెదేపా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అరకు ప్రాంతం పర్యటకంగా మరింత అభివృద్ధి చెందాలంటే మళ్లీ చంద్రన్న పాలన రావాలని కోరారు. లోకేశ్ మాట్లాడుతూ గిరిజనుల బాగుకోసం శ్రావణ్ అహర్నిశలు కష్టపడతారని కితాబిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details